7/11 (జులై 2011) ముంబై బాంబు పేలుళ్ళు -ది హిందూ ఫొటోలు

జులై 13, 2011 రోజు, భారత ప్రజల జీవితాల్లో మరొక దుర్దినంగా నమోదు కానున్నది. నేడు జరిగిన బాంబు పేలుళ్ళ దృశ్యాలను ఫోటో గ్రాఫర్ వివేక్ బెంద్రె కెమెరాలో బంధించగా ‘ది హిందూ’ పత్రిక తన వెబ్‌సైట్ లో ప్రచురించింది. ఫోటోలు చూడ్డానికి భయానకంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఏడు ఫొటోలు ఒపేరా హౌస్ వద్ద జరిగిన పేలుడు అనంతరం తీసినవి కాగా ఒకటి దాదర్ స్టేషన్ దగ్గరి దృశ్యాన్ని టీవి ఛానెల్ చూపుతోంది. పాకిస్ధాన్ ప్రభుత్వం…

ముంబైలో మళ్ళీ బాంబు పేలుళ్ళు, 13 మంది మరణం, 100 మందికి గాయాలు

అప్ డేట్ – 3: బుధవారం జరిగిన బాంబు పేలుళ్ళలో మరణించినవారి సంఖ్య 13 కు చేరుకుందని పోలీసులు చెప్పారని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది.. మహా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా 13 మంది చనిపోయారని ధృవీకరించాడు. ఐ.ఇ.డి (ఇంప్రూవైజ్‌డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్) లతో పేలుళ్ళు జరిపారని పోలీసులు చెప్పారు. దాదర్ లో కారులో ఉంచిన బాంబు పేలిందని తెలుస్తోంది. గొడుగు కింద ఉంచిన మరొక బాంబుని నిర్వీర్యం చేశారు. అప్ డేట్ – 2: ఈరోజు…

అధిక ద్రవ్యోల్బణాన్ని అధిగమించి రికార్డు ఆర్ధిక వృద్ధి నమోదు చేసిన చైనా

అధిక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ ధరలు, అధిక ధరలు అన్నింటినీ అధిగమిస్తూ చైనా అర్ధిక వ్యవస్ధ ఈ సంవత్సరం రెండో క్వార్టర్ లో 9.5 ఆర్ధిక వృద్ధిని నమోదు చేసి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఆర్ధికవేత్తలు, మార్కెట్ విశ్లేషకుల అంచనా 9.4 శాతం అంచనాని దాటి చైనా అర్ధిక వ్యవస్ధ వృద్ధి చెందటం గమనార్హం. చైనా ఆర్ధిక వృద్ధి నెమ్మదిస్తూన్నదన్న భయాలను ఈ దెబ్బతో చైనా పటాపంచలు చేసినట్లయింది. తాజా ఆర్ధిక వృద్ధి రేటుతో ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి…

‘గూగుల్,’ ‘స్కైప్’ సర్వీసులను పర్యవేక్షించే అవకాశం మా గూఢచాలకు ఇవ్వాలి -భారత ప్రభుత్వం

‘గూగుల్ ఇంక్,’ ‘స్కైప్ లిమిటెడ్’ లతో పాటు ఇతర ఇంటర్నెట్ సంస్ధలు, వినియోగదారులకు అందించే సేవలను పర్యవేక్షించే అవకాశం దేశ భద్రతా ఏజెన్సీలకు ఉండాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఆయా కంపెనీలు తాము అందజేసే సర్వీసుల ద్వారా మార్పిడి చేసే సమాచారాన్ని ముందుగానే చదివే అవకాశం భారత దేశ భధ్రతా బలగాలు, గూఢచార సంస్ధలకు ఉండాలనీ, భారత దేశ భద్రత రీత్యా అది అవసరమనీ సంబంధిత కేంద్ర మంత్రి బుధవారం, పరిశ్రమల సమావేశాల సందర్భంగా కోరాడు.…

అమెరికా అణు ప్లాంట్ల వద్ద ఇపుడున్న భద్రతా ఏర్పాట్లు సరిపోవు -టాస్క్ ఫోర్స్

జపాన్‌లొ మార్చిలో సంభవించిన భూకంపం సునామీల వలన ఫుకుషిమా అణు కర్మాగారం తీవ్రంగా దెబ్బతిన్న తర్వాత అమెరికా ప్రభుత్వం తమ అణు కర్మాగారాల వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించాల్సిందిగా అణు నియంత్రణ కమిషన్‌ (న్యూక్లియర్ రెగ్యులేటరీ కమిషన్ – ఎన్.ఆర్.సి) ను ఆదేశించింది. ఎన్.ఆర్.సి అందుకోసం నిపుణులతో కూడిన టాస్క్ ఫోర్స్ ని నియమించింది. టాస్క్ ఫోర్స్ తయారు చేసిన నివేదికను అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్ధ సంపాదించగా ‘ది హిందూ’ పత్రిక అందులో కొన్ని అంశాలను…