ఎన్నికలలోపు ఇదే చివరి ‘మంత్రివర్గ పునర్వ్యవస్ధీకరణ’ -ప్రధాని

మంత్రివర్గ పునర్వ్యవస్ధీకరణ అనంతరం 11 మంది మంత్రుల ప్రమాణ స్వీకారాలు ముగిశాక ప్రధాని మన్మోహన్ ఎవరూ ఊహించని ప్రకటన చేశాడు. మంత్రివర్గ మార్పులు, చేర్పులు అనంతరం అసంతృప్తిపరులు, అసంతుష్టులు ఇంకా ఉండగానే ఆయన “ఇదే చివరి ‘మంత్రివర్గ పునర్వ్యవస్ధీకరణ’” అని ప్రకటించి ఆహూతులను ఆశ్చర్యపరిచారు. తదుపరి పునర్వ్యవస్ధీకరణలో చోటు దక్కకపోతుందా అని ఆశిస్తున్నవారి ఆశలపై నీళ్ళు జల్లాడు. 2014 ఎన్నికలలోపు, అంటే ఇంకా మూడు సంవత్సరాల పదవీకాలం మిగిలి ఉండగానే చివరి మార్పులని ప్రకటించడం నిజంగానే ఆశ్చర్యకరమైన…

అమెరికాలో “ది గ్రేట్ రిసెషన్” తర్వాత మొలిచిన కొత్త ఉద్యోగాలు కేవలం “అర మిలియన్” -టేబుల్

ప్రపంచాన్ని అతలా కుతలం చేసిన “ది గ్రేట్ రిసెషన్,” అమెరికాలో డిసెంబరు 2007 లో ప్రారంభం కాగా, జూన్ 2009 లో ముగిసిందని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అప్పటినుండి అమెరికాలో ప్రవేటు కంపెనీలు రిసెషన్ ముందు స్ధాయిలో లాభాలు సంపాదిస్తుండగా, ఉద్యోగాల మార్కెట్ మాత్రం ఇంకా కోలుకోలేదు. సంక్షోభం ముగిసాక జూన్ 2009 లో అమెరికాలో 130.5 మిలియన్ల ఉద్యోగాలు ఉండగా, వాటి సంఖ్య రెండేళ్ళ తర్వాత జూన్ 2011 నాటికి కేవలం అర మిలియన్…

‘సి’ ఫర్ ‘కేపిటలిజం’ -కార్టూన్

నూతన మిలీనియంలో భాషలో ఇప్పటికే ఉన్న పదాలకు కొత్త అర్ధాలు వచ్చి చేరుతున్నాయి. నిన్న ఉన్న అర్ధం నేడు ఉండకపోవచ్చు. ఈ రోజున్న అర్ధం రేపు పాతబడిపోవచ్చు.  పాత సీసాలోనే కొత్త సారా అన్నమాట! పైకి ఎప్పటిలాగే కనపడినా లోపల సారంలో మాత్రం  తీవ్ర మార్పులు వస్తున్నాయి. ఒక దేశంపైకి దాడి చేయడానికి ఆ దేశంలో ప్రపంచాన్ని నాశనం చేయగల “సామూహిక విధ్వంసక ఆయుధాలు” ఉన్నాయని సాకు చూపడం నిన్నటి టెక్నిక్కు. ఆ దేశంలోని ప్రజల రక్షణకే…

ఎట్టకేలకు హమీద్ కర్జాయ్ సోదరుడిని చంపేసిన మిలిటెంట్లు

అనేక సార్లు మిలిటెంట్ల హత్యా ప్రయత్నాలనుండి తప్పించుకున్న ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ సోదరుడు అహ్మద్ వాలి కర్జాయ్ మంగళవారం హత్యకు గురయ్యాడు. ఆఫ్ఘన్ ప్రభుత్వంలొ చోటు చేసుకున్న అనేక తప్పులకు అహ్మద్ కర్జాయ్ కారణంగా ఆరోపణలు ఎదుర్కొన్నాదు. హమీద్ కర్జాయ్ అవినీతిలో అహ్మద్ కర్జాయ్ అసలు పాత్రధారి అని ఆరోపణలు వెల్లువెత్తాయి. అమెరికా వైపు నుండి కూడా ఈయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఎందరు ఎన్ని విధాలుగా ఆరోపించినప్పటికీ ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్,…

మే నెలలో మళ్ళీ క్షీణించిన భారత పారిశ్రామీక వృద్ధి, షేర్లు పతనం

భారత పారిశ్రామికీ వృద్ధి గత సంవత్సరం మే నెలతో పోలిస్తే ఈ సంవత్సరం మే నెలలో మళ్ళీ క్షిణించింది. మే నెలలో పారిశ్రామిక వృద్ధి 5.6 శాతంగా నమోదయ్యింది. రాయిటర్స్ సర్వేలో ఇది 8.2 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. ఈ క్షీణత అంచనాల కంటే ఎక్కువగా ఉండడం, ఇటలీ, స్పెయిన్ దేశాలు సావరిన్ అప్పు సంక్షోభానికి దగ్గర్లోనే ఉన్నాయన్న అనుమానాలు తీవ్రం కావడంతో భారత షేర్ మార్కెట్లు నష్టాల బాటలోనే మూడోరోజూ కొనసాగాయి. గత శుక్రవారం…

బహుళజాతి కంపెనీలకు మద్దతుగా కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేసిన ప్రధాని

భారత ప్రధాని రెండో సారి తన మంత్రివర్గంలో మార్పులు తలపెట్టారు. ఈ సారి మార్పుల్లో ప్రధానంగా సంస్కరణలను దృష్టిలో పెట్టుకుని చేసినట్లుగా కనిపిస్తోంది. బహుళజాతి కంపెనీల ప్రవేశానికి అడ్డంకిగా ఉన్నారని భావిస్తున్న మంత్రులను వారి శాఖలనుండి తొలగించారు. పెద్ద ఎత్తున మార్పులు జరుగుతాయని భావించినప్పటికీ అలాంటిదేమీ జరగలేదు. ప్రధాన విధానాల అమలుతో ముడిపడి ఉన్న మంత్రిత్వ శాఖలను పెద్దగా కదిలించలేదు. మిత్ర పార్టీల శాఖలను కూడా పెద్దగా మార్చలేదు. డి.ఎం.కె మంత్రి దయానిధిమారన్ రాజీనామా చేసిన స్ధానాన్ని…

పాక్‌కి అమెరికా సాయం నిలిపివేయడాన్ని ఆహ్వానించిన ఇండియా

పాకిస్ధాన్‌కి ఇవ్వవలసిన 800 మిలియన్ డాలర్ల సహాయాన్ని నిలిపివేయడం పట్ల భారత ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసింది. అమెరికా చర్యను ఆహ్వానిస్తున్నట్లు ఇండియా విదేశాంగ శాఖ మంత్రి ఎస్.ఎం.కృష్ణ ప్రకటించాడు. అమెరికా అందజేసే ఆయుధాలవలన ఈ ప్రాంతంలో ఆయుధాల సమతూకాన్ని దెబ్బతీసి ఉండేదని ఆయన అన్నాడు. “ఇండియా, పాకిస్ధాన్ ల మధ్య నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్ధితుల దృష్ట్యా, ఈ ప్రాంతాన్ని అమెరికా భారీగా ఆయుధమయం చేయడం వాంఛనీయం కాదని ఇండియా మొదటినుండి చెబుతున్న నేపధ్యంలో, ఆయుధీకరణ…