కల్కా మెయిల్ పట్టాలు తప్పడంతో 35 మంది దుర్మరణం, 200 మందికి పైగా గాయాలు -‘ది హిందూ’ ఫోటోలు

భారత రైల్వేల కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. హౌరా నుండి ఢిల్లీ వెళ్తున్న కల్కా మెయిల్ ఉత్తర ప్రదేశ్ లోని ఫతేపూర్ వద్ద మధ్యాహ్నం గం.12:20 ని.లు సమయంలో పట్టాలు తప్పింది. మొత్తం 15 బోగీలు పట్టాలు తప్పగా 10 బోగీల షేపులు మారిపోయాయి. సిగ్నల్స్, ఫిష్ ప్లేట్లు అన్ని బాగానే ఉన్నాయని ప్రాధమిక విచారణలో తేలింది. డ్రైవర్ తాగిలేడని రైల్వే అధికారులు నిర్ధారించారు. కారణం ఇంకా స్పష్టం కాలేదు. తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని రైల్వే…

నాటో దళాలపై తిరగబడ్డ ఆఫ్ఘన్ సైనికుడు, దాడిలో ఇద్దరి మరణం

ఆఫ్ఘనిస్ధాన్‌లో దురాక్రమణ సేనలపైన వారు శిక్షణ ఇస్తున్నామని చెబుతున్న ఆఫ్ఘన్ సైనికులే తిరగబడడం కొనసాగుతోంది. నాటో బలగాలను ఠారెత్తిస్తున్న ఇలాంటి దాడులు 2011 సంవత్సరంలో అమెరికా బలగాలకు తీవ్రం నష్టం చేకూర్చాయి. ఆఫ్ఘనిస్ధాన్‌లో అమెరికా తదితర నాటో దేశాల సైనికులకు అత్యంత భద్రత కలిగిన ప్రాంతం అని చెప్పుకుంటున్న ప్రాంతాల్లోనే ఇటువంటి ఘటనలు జరగడం విశేషం. ఆఫ్ఘనిస్ధాన్ రాజధాని నగరమైన కాబూల్, పష్తూనేతరులు నివసించే ఉత్తర రాష్ట్రాలు మిలిటెన్సీ తక్కువగా ఉన్న ప్రాంతాలనీ, భద్రమైన ప్రాంతాలనీ నాటో…

మరోసారి నిరవధిక ఆందోళనలో ఈజిప్టు ప్రజానీకం, ముబారక్ అవశేషాల కోనసాగింపుపై ఆగ్రహం

18 రోజుల నిరవధిక దీక్షతో 30 సంవత్సరాల నియంతృత్వ పాలనను కూలదోసి, నియంత ముబారక్‌ను జైలుపాలు చేసిన ఈజిప్టు ప్రజానీకం మరొకసారి పోరాటబాట చేపట్టారు. ఈజిప్టు విప్లవం చేసిన డిమాండ్లను నెరవేర్చడంలో తాత్కాలిక సైనిక ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదనీ, డిమాండ్లు నెరవేర్చడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయడం లేదనీ ఈజిప్టు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈజిప్టు విప్లవం ప్రారంభ కాలంలో నిరసనకారులను కాల్చి చంపడానికి కారణమైన సైనికాధికారులనూ, పోలీసులనూ విచారించడం లేదనీ, వారిని స్వేచ్ఛగా వదిలేస్తున్నారనీ పైగా నిరసన కారులపై…

13 ఏళ్ళ బాలుడి హత్య కేసులో రిటైర్డ్ ఆర్మీ అధికారిని అరెస్టు చేసిన సి.బి-సి.ఐ.డి

తమిళనాడులోని మిలట్రీ నివాస సముదాయం వద్ద బాదం కాయకోసం చెట్టెక్కుతున్న 13 సంవత్సరాల బాలుడు దిల్షాన్‌ను తుపాకితో కాల్చి హత్య చేసిన కేసులో సి.బి-సి.ఐ.డి విభాగం ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారిని అరెస్టు చేసింది. బాలుడిపై కాల్పులు జరిపింది తానేనని ఆయన అంగీకరించినట్లు సమాచారం. బాలుడు చనిపోయిన రోజున మిలట్రీ నివాస సముదాయం వద్ద సాయుధ సెక్యూరిటీ గార్డులను తాము నియమించలేదని ఆర్మి అధికారులు చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, కేసును సీరియస్‌గా తీసుకోవడంతో కేసులో పురోగతి…

చైనాలో మరింత క్షీణించిన వ్యాపార వృద్ధి, రికార్డు స్ధాయిలో వాణిజ్య మిగులు

చైనాలో జూన్ నెలలో వ్యాపార కార్యకలాపాలు మరింత నెమ్మదించాయని తాజా గణాంకాలు తెలుపుతున్నాయి. మే నెలలో కంటే జున్ నెలలో కూడా దిగుమతులు పడిపోయాయి. దానితో చైనాకు వాణిజ్య మిగులులో మరింత పెరుగుదల రికార్డయ్యింది. ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధ కలిగిన చైనా, ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం వాణిజ్య మిగులు 22.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. మే నెలలో దిగుమతుల వృద్ధి రేటు 28.4 శాతం ఉండగా, జూన్ నెలలో అది…