పోర్నోగ్రఫీ ధుష్ప్రభావం: ఐదేళ్ళ పాప హత్య కేసులో పదేళ్ళ బాబు అరెస్టు

అభం శుభం తెలియని పసి పిల్లలపై పోర్నోగ్రఫీ ఎంత దుష్ప్రభావం పడేస్తుందో ఈ సంఘటన తెలుపుతుంది. ఐదేళ్ళ బాలిక చెరువులో పడి మృతి చెందిన కేసులో పదేళ్ళ బాలుడిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో నెడుంగండం గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకుందని “ది హిందూ” పత్రిక తెలిపింది. బాలిక శవం నెడుంగండం లోని ఎస్టేట్ ఏరియా వద్దనున్న చెరువులో లభించిందని పత్రిక తెలిపింది. బాలుడు చేసిన రేప్…

జులై 9న వెలసిన కొత్త దేశం, 196వ దేశంగా దక్షిణ సూడాన్

ప్రపంచ పటంలోకి మరొక కొత్త దేశం వచ్చి చేరింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన రిఫరెండంలో దక్షిణ సూడాన్ ప్రజలు 90 శాతానికి పైగా కొత్త దేశాన్ని కోరుకున్నారు. ప్రజల నిర్ణయాన్ని అమలు పరుస్తూ జులై 9, శనివారం తెల్లవారు ఝాము ప్రారంభ క్షణాల్లో దక్షిణ సూడాన్ ను ఏర్పాటు చేస్తూ ప్రకటన జారీ అయింది. ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు బాన్ కి మూన్, ఐక్య సూడాన్ అధ్యక్షుడు ఆల్-బషర్, 30 ఆఫ్రికా దేశాల ప్రతినిధుల సమక్షంలో…

సుదీర్ఘ లక్ష్య క్షిపణులను మొదటిసారి హిందూ మహాసముద్రంలోకి పేల్చి పరీక్షించిన ఇరాన్

ఈ సంవత్సరం ప్రారంభంలో తన సుదీర్ఘ లక్ష్య క్షిపణులను మొట్టమొదటిసారిగా హిందూ మహాసముద్రంలోకి పేల్చడం ద్వారా పరీక్షించినట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. శనివారం, ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌లొ ఈ ప్రకటన వెలువడింది. రెండు లాంగ్-రేంజ్ మిసైళ్ళను పరీక్షించినట్లు ఇరాన్ వెల్లడించింది. “బహమాన్ నెలలో (జనవరి 21 నుండి ఫిబ్రవరి 19 వరకు) 1900 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను ఉత్తర ఇరాన్ లో గల సెమ్‌నాన్ రాష్ట్రం నుండి హిందు మహాసముద్రం ముఖద్వారం వద్దకు…

3 సం.ల అత్యధిక స్ధాయిలో చైనా ద్రవ్యోల్బణం, చైనా ఆర్ధిక వృద్ధిపై భయాలు

జూన్ నెలలో చైనా ద్రవ్యోల్బణం గత మూడు సంవత్సరాల అత్యధిక స్ధాయికి చేరింది. ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి వీలుగా చైనా ఆర్ధిక వ్యవస్ధలో ద్రవ్య చలామణిని తగ్గించడానికి సెంట్రల్ బ్యాంకు వడ్దీ రేట్లను మరింత పెంచే అవకాశాలు పెరగడంతో, వడ్డీ రేట్ల పెంపుదల వలన చైనా ఆర్ధిక వృద్ధి రేటు పడిపోయే ప్రమాదం ఉందని ప్రపంచ పెట్టుబడుదారులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి రేటును ముందుకు తీసుకెళ్ళడంలో చైనా ఆర్ధిక వ్యవస్ధ…

నాటో దాడుల నుండి రక్షణ కోసం నడుం బిగించిన లిబియా మహిళలు -వీడియో

అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలు లిబియాపై దాడులకు సిద్ధమవుతున్న ప్రారంభ కాలంలో లిబియా అధిపతి గడ్దాఫీ లిబియాను రక్షించుకోవడం కోసం ప్రజలకు ఆయుధాలిస్తామని హెచ్చరించాడు. నాటో వైమానిక దాడులకు ముందు గడ్దాఫీ సుదీర్ఘపాలనతో విసిగి ఉన్న లిబియన్లు కూడా విదేశాల దాడులకు వ్యతిరేకంగా నిలబడిన గడ్దాఫీ వెనక అనివార్యంగా సమీకృతులయ్యారు. లిబియా ప్రజల రక్షణ కోసమే లిబియాపై బాంబింగ్ జరుపుతున్నామన నాటో దేశాల మోసపు మాటలలో నిజం ఎంత ఉందో లిబియన్లకు బాగానే తెలుసు. లిబియాలో ఇప్పుడు…