2జి స్పెక్ట్రమ్ కుంభకోణం: కేంద్ర మంత్రి దయానిధి మారన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

సి.బి.ఐ ని తనపని తనను చేసుకోనిస్తే తగిన ఫలితాలను చూపించగల సత్తా ఉన్న సంస్ధ అని నిరూపించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ నుండి సి.బి.ఐ ని తాత్కాలికంగా తప్పించి సుప్రీం కోర్టు పర్యవేక్షణలో పని చేస్తున్నందున ఒక్కో తీగా లాగుతూ అనేక డొంకల్ని కదిలిస్తోంది. సి.బి.ఐ బుధవారం సుప్రీం కోర్టుకి సమర్పించిన ‘స్టేటస్ రిపోర్ట్’ లో ప్రస్తుతం కేంద్రంలో టెక్స్ టైల్స్ శాఖ మంత్రిగా ఉన్న దయానిధి మారన్ అఘాయిత్యాన్ని పొందుపరిచింది. మలేషియా కంపెనీకి మేలు చేయడానికీ,…

తీవ్రమవుతున్న యూరప్ అప్పు సంక్షోభం, పోర్చుగల్ రేటింగ్ ఢమాల్

గత సంవత్సరం రెండో అర్ధ భాగం అంతా ప్రపంచ కేపిటల్ మార్కెట్లను వణికించిన యూరప్ అప్పు సంక్షోభం మళ్ళీ మరొకసారి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గత మే, జూన్ నెలల్లో గ్రీసు సంక్షోభమే ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్లను ఆవరించింది. గ్రీసుకు రెండో బెయిలౌట్ ఇవ్వడానికి ఇ.యు ఒక ఒప్పందానికి రావడమూ, గ్రీసు తాజాగా సరికొత్త పొదుపు చర్యలను అమలు చేసే బిల్లును ఆమోదించడమూ విజయవంతంగా ముగియడంతో గ్రీసు తాత్కాలికంగా చర్చలనుండి పక్కకు తప్పుకుంది. తాజాగా మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్…

బిన్ లాడెన్ కుటుంబం అప్పగింతకు పాకిస్ధాన్ నిరాకరణ

ఒసామా బిన్ లాడెన్ భార్యలను, పిల్లలను తమ స్వస్ధాలకు పంపడానికి పాకిస్ధాన్ దాదాపుగా నిరాకరించింది. ఒసామా బిన్ లాడెన్ మరణానంతరం అతని భార్యలను, పిల్లలను పాక్ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. లాడెన్ హత్యపై విచారణకు ప్రభుత్వం నియమించిన కమిషన్ అంగీకరిస్తే తప్ప ఆయన కుటుంబాన్ని ఇతర దేశాలకు అప్పగించబోమని పాక్ ప్రభుత్వ పానెల్ ప్రకటించింది. ముగ్గురు భార్యలు, 13 మంది పిల్లలతో కూడిన ఒసామా కుటుంబం ప్రస్తుతం పాకిస్ధాన్ ప్రభుత్వ రక్షణలో ఉన్నారు. మే 2…

రెండు రోజుల బంద్‌తో తెలంగాణలో స్తంభించిన సాధారణ జనజీవనం

తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ జె.ఎ.సి ఇచ్చిన 48 గంటల బంద్ విజయవంతమైందనే చెప్పాలి. రెండో రోజు వరసగా సాధారణ జన జీవనం స్తంబించిపోయింది. స్కూళ్ళు, కాలేజిలు, షాపులు, పెట్రోల్ పంపులు ఇంకా ఇతర వ్యాపార సంస్ధలన్నీ మూసివేశారు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు స్తంభనకు గురయ్యాయి. రవాణా వ్యవస్ధ తెలంగాణలోని పది జిల్లాల్లోనూ ప్రతిష్టంభనకు గురయ్యింది. హైద్రాబాదులో కూడా బందు పూర్తిగా విజయవంతమైందని పత్రికా సంస్ధలు తెలిపాయి. ఎ.పి.ఎస్.ఆర్.టి.సి ముందు జాగ్రత్తతో వ్యవహరించి బస్సులను గ్యారేజిలకే పరిమితం చేశారు.…

జర్నలిస్టు హత్యలో ఐ.ఎస్.ఐ హస్తం లేదు -పాక్ ప్రభుత్వం

ఏసియా టైమ్స్ విలేఖరి సయ్యద్ సలీమ్ షహజాద్ హత్యలో పాక్ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ హస్తం ఉందనడాన్ని పాకిస్ధాన్ ప్రభుత్వం తిరస్కరించింది. రహస్య గూఢచర్య సమాచారం విలేఖరి హత్యలో ఐ.ఎస్.ఐ ప్రత్యక్ష జోక్యం ఉందని నిరూపిస్తున్నట్లుగా వచ్చిన వార్తలను పాక్ ఖండించింది. పాకిస్ధాన్ భద్రతా బలగాల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికే జరుగుతున్న అంతర్జాతీయ కుట్రలో భాగమే ఈ కధనాలని ఆరోపించింది. ఐ.ఎస్.ఐ కి చెందిన సీనియర్ ఉన్నాధికారులు షహజాద్ హత్యకు పురమాయించారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక…

“సల్వా జుడుం” ఏర్పాటు చట్ట విరుద్ధం -చత్తిస్‌ఘడ్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు గడ్డి పెట్టిన సుప్రీం కోర్టు – 2

“(సల్వా జుడుం యొక్క) రాజ్యాంగబద్ధమైన సమ్మతిని కొలవడానికి ఆ బలగాల ప్రభావశీలత (effectiveness) ఒక్కటే కొలబద్ద కాజాలదు, కాగూడదు కూడా. ఛత్తీస్ ఘఢ్‌లో మావోయిస్టు/నగ్జలైట్ల కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఎస్.పి.ఓ లు ప్రభావవంతంగా ఉన్నాదన్న అంశం తప్పుడు ప్రతిపాదన, కాకుంటే అనుమానాస్పదమైన ప్రతిపాదన. వాదన కోసం నిజంగానే ఎస్.పి.ఓలు మావోయిస్టులు/ నగ్జలైట్లకి వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉపయోగపడుతున్నారని అంగీకరించినా, తద్వారా వారివలన చేకూరుతున్నాయంటున్న అనుమానాస్పద లాభాలు, రాజ్యాంగంపై ఉండవలసిన పవిత్ర నమ్మకం, గౌరవాలను పెద్ద ఎత్తున కోల్పోవడానికీ, సామాజిక క్రమబద్ధత…