మే నెలలో 111 శాతం పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

2011-12 ఆర్ధిక సంవత్సరంలో మే నెలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ) 111 శాతం పెరిగాయని ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఒక్క మే నెలలోనే ఎఫ్.డి.ఐ లు 4.66 బిలియన్ డాలర్లు దేశంలోకి వచ్చాయని ప్రభుత్వం సంబరంగా ప్రకటించింది. ఇది గత ఆర్ధిక సంవత్సరంలో మే నెలలో వచ్చిన 2.21 బిలియన్ డాలర్ల ఎఫ్.డి.ఐ లతో పోలిస్తే 111 శాతం అధికమని ప్రభుత్వం తెలిపింది. అంతే కాక గత 11 సంవత్సరాల్లో రెండవ అతి పెద్ద మొత్తం…

కేంద్రానికి సుప్రీం కోర్టు ఝలక్, నల్లడబ్బు విచారణ పర్యవేక్షణకు ‘సిట్’ నియామకం

సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి గట్టి సవాలే విసిరింది. నల్ల డబ్బు వెలికి తీయడానికి కేంద్రం నియమించిన ‘హై లెవల్ కమిటీ’ (హెచ్.ఎల్.సి) పై పర్యవేక్షణకు “స్పెషల్ ఇన్‌వెష్టిగేషన్ టీం” (ఎస్.ఐ.టి – సిట్) ని ఏర్పాటు చేసింది. సుప్రీం నియమించిన సిట్ కు ఛైర్మన్‌గా రిటైరైన జస్టిస్ బి.పి.జీవన్ రెడ్డిని నియమించింది. డిప్యుటీ ఛైర్మన్ గా మరొక రిటైర్డ్ జస్టిస్ ఎం.బి.షా ను నియమించింది. ప్రభుత్వం నియమించిన హెచ్.ఎల్.సి ఇకనుండి సిట్ లో భాగంగా పనిచేస్తుంది.…

రాజీనామాలు చేసింది రాజ్యాంగ సంక్షోభం సృష్టించడానికి కాదు -కాంగ్రెస్ మంత్రులు

తాము రాజీనామా చేసింది రాజకీయ లేదా రాజ్యాంగ సంక్షోభం సృష్టించడానికో, కాంగ్రెస్ హైకమాండ్‌ను ధిక్కరించడానికో కాదనీ తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్రం పట్ల ఉన్న బలీయమైన ఆకాంక్షను కాంగ్రెస్ హైకమాండ్ కి తెలియజేయడానికేనని సీనియర్ మంత్రి జానారెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. అనివార్య పరిస్ధితుల రీత్యానే తెలంగాణ ఎం.ఎల్.ఎ లు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారని, తమ రాజీనామాలద్వారా తెలంగణ రాష్ట్ర సంక్షోభానికి పరిష్కారం కనుగునడానికి వారు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపాడు. డిసెంబరు 9, 2009 తేదీన…

13 ఏళ్ళ బాలుడిని కాల్చి చంపిన డిఫెన్సు కాంప్లెక్స్ సెక్యూరిటీ గార్డు

చెట్టు కాయను కోసుకు తిందామని మిలట్రీ కాంప్లెక్సులోకి గోడదూకి వెళ్ళీన 13 ఏళ్ళ బాలుడిని ఆ కాంప్లెక్సు సెక్యూరిటీ గార్డు తుపాకితో కాల్చి చంపాడు. ఆ సైనికుడు ముందూ వెనకా చూడకుండా విచక్షణా రహితంగా తుపాకికి పనిచెప్పి ఓ తల్లి గర్భశోకానికి కారణమయ్యాడు. రక్షణ బలగాలు నివసించే నివాస కాంప్లెక్స్ లోకి దిల్షాన్ అనే బాలుడు తన ఇద్దరు మిత్రులతో కలిసి గోడ దూకి ప్రవేశించాడు. చెట్టుకి కాసిన పండుని కోసుకు తిందామని చెట్టు ఎక్కుతుండగా సెక్యూరిటీ…

తెలంగాణ కోసం అంతిమ సమరం, కాంగ్రెస్, టిడిపి పార్టీల ఎం.ఎల్.ఎల రాజీనామా అస్త్ర ప్రయోగం

తెలంగాణ రాష్ట్రం కోసం అంతిమ సమరం ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులలో సగం కంటే ఎక్కువమంది సోమవారం రాజీనామా చేశారు. పాలక కాంగ్రెస్ పార్టీకి చెందిన 37 మంది ఎం.ఎల్.ఎ లు, పతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన 28 మంది ఎం.ఎల్.ఎ లు తమ రాజీనామా లేఖలను డిప్యుటీ స్పీకర్‌కు అందించినట్లు ప్రకటించారు. అంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా, కేంద్ర హోం మంత్రి చిదంబరం ఎ.పి లొ పరిస్ధితి అదుపులోనే ఉందనీ,…

నాటో దాడులకు వ్యతిరేకంగా లిబియా ప్రజల అతి పెద్ద ప్రదర్శన -వీడియో

లిబియా ప్రజలు గడ్డాఫీని తిరస్కరిస్తున్నారనీ, గడ్డాఫి పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారనీ గడ్దాఫీ ప్రభుత్వ బలగాలు లిబియా ప్రజలను చంపుతుంటే వారిని కాపాడ్డానికే తాము లిబియాపై బాంబులు మిసైళ్ళతో దాడులు చేస్తున్నామనీ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాలు ఊదరగొడుతున్న సంగతి తెలిసిందే. కాని నాటో దాడుల ఫలితంగా గడ్డాఫీని వ్యతిరేకిస్తున్న వారు సైతం తమ వ్యతిరేకతను పక్కన పెట్టి విదేశీ మూకల దాడులను దృఢంగా వ్యతిరేకిస్తున్నారు. జులై 1 జరిగిన లిబియా ప్రజలు పాల్గొన్న అతి పెద్ద…

అమెరికాలో ఆరు బ్యాంకుల అధికారులకు చెల్లించిన జీతాలూ, బోనస్ ల మొత్తం కాన్సాస్ రాష్ట్ర జీడీపీ కి సమానం

అమెరికాలో ఫైనాన్స్ సంస్ధలు దోపిడీకి పెట్టింది పేరు. వాళ్ళు ఎన్ని నేరాలు చేసినా అది అమెరికా ఆర్ధిక వృద్ధి కోసమే. వాళ్ళవలన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం సంభవించి అమెరికా, యూరప్ లు అతలాకుతలమైనా అది ప్రపంచ ఆర్ధిక వృద్ధికీ, ప్రపంచ ప్రజల సంతోషం కోసమే. ప్రపంచ ప్రజల సంతోషం కోసం అహోరాత్రాలూ కష్టపడుతున్న బ్యాంకు ఎగ్జిక్యూటివ్ సిబ్బంధికి బ్యాంకులు ఇచ్చే జీతాలూ, బోనస్^లూ, వివిధ సదుపాయాల మొత్తం ఎంతో రాయిటర్స్ సంస్ధ లెక్కేసింది. వాల్ స్ట్రీట్ బ్యాంకుల్లో…