ఇండియా పశుదాణా ఎగుమతుల్లో ప్రమాదకరమైన రసాయనం -చైనా హెచ్చరిక

ఇండియా నుండి ఎగుమతి అవుతున్న పశువుల దాణాలో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని చైనా క్వాలిటీ విభాగం హెచ్చరించింది. చైనా ఆరోపణలను అధ్యయనం చేస్తున్నట్లు సాల్వెంట్స్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యనిర్వాహక డైరెక్టర్ బి.వి మెహతా చెప్పినట్లుగా వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. ప్రమాదకరమైన రసాయనం “మాలఖైట్ గ్రీన్” భారతదేశం నుండి దిగుమతి అయిన ‘రేప్ గింజల గానుగ పిండి’ (rapeseed meal – రేప్ గింజల నుండి నూనె తీయగా మిగిలే పిప్పి) లో కనుగొన్నామని…

ధాన్యం ఎగుమతికి పచ్చ జెండా ఊపిన కేంద్రం?

ధాన్యం ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపిందని వాల్‌స్ట్రీట్ జర్నల్పత్రిక రాసింది. గోదాముల్లో ఖాళీ లేక ఆరుబైట నిలవ చేయవలసి వస్తున్నదనీ, ఆరుబైట ఉంచడంతో ఎండా వానలకు చెడిపోతున్నాయనీ చెబుతూ కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శరద్ పవార్ దాదాపు సంవత్సరం నుండీ ఎగుమతి చేద్దాం అని పోరుతూ వచ్చాడు. మిల్లర్లతో ఉన్న గాఢమైన అనుబంధం ఆయన్ను దేశంలో జనాలకి ధాన్యం అవసరం ఉందన్న స్పృహ కంటే విదేశాల్లో ధరలు ఎక్కువగా ఉన్నాయి, ఎగుమతులకు ఇదే…

వన్‌డే, టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడటానికి ఇండియా పర్యటించనున్న పాకిస్ధాన్

ముంబై టెర్రరిస్టు దాడులతో ఇండియా, పాకిస్ధాన్‌ల మధ్య రాజకీయ సంబంధాలతో పాటు క్రికెట్ సంబంధాలను కూడా ఇండియా తెంచుకున్న సంగతి తెలిసిందే. ఉపఖండంలో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌లో తలపడిన దాయాదులు తమ సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రక్రియను క్రికెట్ దౌత్యంతో ప్రారంభించారు. ఇండియా ప్రధాని, ఇండియా, పాక్‌ల సెమీఫైనల్ మ్యాచ్ తిలకించడానికి పాక్ ప్రధానిని ఆహ్వానించగా ఇరు దేశాల ప్రధానులు మ్యాచ్‌ని ఆద్యంతం తిలకించి సంబంధాల మెరుగుదలకు తాము సిద్ధమని తెలిపాయి. జూన్ నెలలో…

ప్రజాందోళనల నడుమ కోతలు, రద్దుల బిల్లుని ఆమోదించిన గ్రీసు పార్లమెంటు

గ్రీసు ప్రభుత్వం తన ప్రజలపై ఆమానుషంగా ఆర్ధిక దాడులకు తెగబడే బిల్లుని ఆమోదించింది. ప్రవేటు, ప్రభుత్వ రంగాలలోని కార్మికులు, ఉద్యోగులు మంగళ, బుధవారాల్లో 48 గంటల సమ్మెను నిర్వహించినా, పార్లమెంటు బయట విరసనకారులు పోలీసులతో తలపడినా గ్రీసు ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకు పోయింది. 155 – 138 ఓట్ల తేడాతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పొదుపు చర్యల బిల్ల ను పార్లమెంటు ఆమోదంచింది. ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు అప్పు ఇస్తున్న సందర్భంగా విధించిన…

ఇంధన ద్రవ్యోల్బణం పైపైకి, మళ్ళీ రెండంకెలకు చేరనున్న ప్రధాన ద్రవ్యోల్బణం?

డీజెల్, కిరోసిన్, గ్యాసు ధరలు పెంచకముందే ఇంధన ధ్రవ్యోల్బణం పెరగి కూర్చుంది. పెరిగిన ధరలు తోడైతే ప్రధాన ద్రవ్యోల్బణం మళ్ళీ రెండంకెలకు చేరుకోవచ్చని మార్కెట్లు విశ్లేషకు అంచనా వేస్తున్నారు. వెరసి భారత ప్రజలు భరించలేక సతమతమవుతున్న అధిక ధరలు మరింతగా పెరుగనున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గడమే ఒకింత ఓదార్పు. కానీ తగ్గిన అంశాలకంటె పెరిగిన అంశాలు మరీ ఎక్కువగా ఉండటంతో ద్రవ్యోల్బణం పెరుగుదల అనివార్యంగా కనిపిస్తోంది. జూన్ 18 తో ముగిసే వారంతో అంతమైన సంవత్సరానికి…

రెండు యుద్ధాలు, మూడు ఫోటోలు, కొన్ని వాస్తవాలు

రెండు యుద్ధాలు అమెరికా, దాని మిత్ర రాజ్యాలైన బ్రిటన్, ఫ్రాన్సు, కెనడా, ఇటలీ మొదలైన నాటో సభ్య దేశాలు దశాబ్ద కాలంగా “టెర్రరిజంపై ప్రపంచ యుద్ద్యం” అని ఒక అందమైన పేరు పెట్టి, తాము జన్మనిచ్చి, పెంచి, పోషించిన సంస్ధలపైనే యుద్ధం ప్రకటించి ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్‌ లపై దురాక్రమణ యుద్ధాలు సాగిస్తున్నాయి. పశ్చిమ దేశాలు అన్యాయంగా సాగిస్తున్న ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ యుద్ధాలే రెండు యుద్ధాలు. మూడు ఫోటోలు