“పౌర అణు ఒప్పందం” విషయంలో అమెరికా, ఇండియాను మోసగించనున్నదా?

2008 సంవత్సరంలో అమెరికా, ఇండియాలు “పౌర అణు ఒప్పందం” పై సంతకాలు చేశాయి. ఆ ఒప్పందం ద్వారా అప్పటివరకు అణు విషయాల్లో ప్రపంచంలో ఏకాకిగా ఉన్న ఇండియా అణు వ్యాపారంలో భాగస్వామ్యం పొందడానికి అమెరికా వీలు కల్పించిందని అంతర్జాతీయ కార్పొరేట్ పత్రికా సంస్ధలు వార్తలు రాశాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఇండియా సంతకం చేయనప్పటికీ అణు వ్యాపారం చేయడానికి ఇండియాకి అవసరమైన అణు పరికరాలు అమ్మడానికీ మినహాయింపు లభించిందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇది అరుదైన విషయమనీ…

ఐ.ఎం.ఎఫ్ ఉపాధ్యక్ష పదవికోసం బ్రిక్స్ కూటమి తీర్మానానికి పాతరేసిన చైనా

బ్రిక్స్ నిర్ణయానికి పాతరేస్తూ చైనా ఫ్రాన్సు అభ్యర్ధి క్రిస్టిన్ లాగార్డేకి ఐ.ఎం.ఎఫ్ అధ్యక్షురాలుగా ఉండడానికి మద్దతు ప్రకటించింది. బ్రిక్స్ (BRICS) అనేది ఐదు లీడింగ్ ఎమర్జింగ్ దేశాల కూటమి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా లు ఇందులో సభ్య దేశాలు. ఐ.ఎం.ఎఫ్ అధ్యక్ష పదవి ఖాళీ అయ్యాక యూరప్ దేశాలు యూరప్ అభ్యర్ధిని ఆ పదవిలో నియమించాలని కోరింది. యూరప్ అప్పు సంక్షోభం ఎదుర్కొంటున్నందున అది న్యాయమని చెప్పింది. ఆత్రుతగా ఫ్రాన్సు ఆర్ధిమ మంత్రి…

అమెరికా సెనేట్‌లో విచిత్రం, వివాద పరిష్కారానికి చైనా బలప్రయోగంపై ఖండన తీర్మానం

అమెరికా సెనేట్‌లో సోమవారం ఒక విచిత్రం చోటు చేసుకుంది. బహుశా ప్రపంచ వింతల్లో ఒకటిగా ఇది స్ధానం సంపాదించుకోవచ్చు. దక్షిణ చైనా సముద్రంలో వివాదాల పరిష్కారానికి చైనా బల ప్రయోగం చేయడాన్ని ఖండిస్తూ అమెరికా సెనేట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అదీ ఏకగ్రీవంగా. ఒక దేశానికి ‘బల ప్రయోగం చేయడం తగదు” అని సుద్దులు చెప్పే అర్హత అమెరికా తనకు తాను దఖలు పరుచుకోవడమే ఇక్కడ వింత. బల ప్రయోగం చేస్తే చైనాని నిస్సందేహంగా తప్పు పట్టవలసిందే.…

మాపై దాడి చేస్తే ఇజ్రాయెల్‌పైనా, అమెరికా సైనిక స్ధావరాలపైనా ప్రతిదాడికి మేం సిద్ధం -ఇరాన్

“ఇరాన్‌పై దాడికి తెగబడితే మేము కూడా ఇజ్రాయెల్ పైనా, ఈ ప్రాంతంలో అమెరికా ఏర్పాటు చేసుకున్న సైనిక స్ధావరాలపైనా దాడి చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం” అని ఇరాన్ ప్రకటించింది. మధ్య ప్రాచ్యంలో ఇరాన్ తమ ప్రధాన శతృవుగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు భావిస్తాయి. ప్రాంతీయంగా ఇజ్రాయెల్ ఆధిపత్యానికి ఇరాన్ నుండే ముప్పు ఉందని అమెరికా, పశ్చిమ దేశాలు భావిస్తాయి. ఇజ్రాయెల్ వద్ద 300 కి పైగా అణ్వాయుధాలు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ అణు ఇంధన సంస్ధ (ఐ.ఏ.ఇ.ఏ)…

అవినీతి బైటపెట్టినందుకు ప్రాణ భయంతో పారిపోయిన ఆఫ్ఘన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్

ఆఫ్ఘనిస్ధాన్ సెంట్రల్ బ్యాంకు గవర్నర్ అబ్దుల్ కదీర్ ఫిట్రాట్ ప్రాణ భయంతో దేశం విడిచి పారిపోవడం ఇక్కడ సంచలనం సృష్టించింది. గవర్నరు పదవికి రాజీనామా చేసి మరీ పారిపోయిన కదీర్ అమెరికాలో తేలాడు. ఆయనకి అమెరికాలో నివాస గృహం ఉందని తెలుస్తోంది. కాబూల్ బ్యాంక్ అనే ప్రవేటు బ్యాంకులో జరిగిన అవినీతిపై అబ్దుల్ కదీర్ దర్యాప్తు జరిపాడు. అవినీతికి పాల్పడినవారి పేర్లను పార్లమెంటులో బహిర్గతం చేశాడు. ఆయన బైటపెట్టిన పేర్లలో అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ సోదరుడు మహమూద్…

త్వరగా సంస్కరణలు ఆమోదించండి, మాకోసం మీ మార్కెట్లు పూర్తిగా తెరవండి -అమెరికా

ఇండియా సంస్కరణల అమలు వేగవంతం చెయ్యాలనీ, తద్వారా భారత మార్కెట్లను అమెరికా ప్రవేశించడానికి వీలుగా మరింత బార్లా గేటులు తెరవాలని అమెరికా కోరింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ తిమోతి గీధనర్ వాషింగ్టన్‌లో జరుగుతున్న ఇండియా అమెరికా బిజినెస్ ఫోరంలో మాట్లాడుతూ ఇండియా ఫైనాన్షియల్ మార్కెట్‌ను బాగా అభివృద్ధి చేసుకుందని సర్టిఫికెట్ ఇచ్చాడు. మరిన్ని సంస్కరణలు ప్రవేశ పెట్టినట్లయితే ఇండియాలో కాపిటల్ మార్కెట్లు అభివృద్ధి చెంది అమెరికా కంపెనీలు స్వేచ్ఛగా ప్రవేశించడానికి వీలు కలుగుతుందని గీధనర్ తెలిపాడు. సమావేశానికి…