గ్రీసు రెండో బెయిలౌట్‌కి ఇ.యు+ఐ.ఎం.ఎఫ్ అంగీకారం, గ్రీకులపై నడ్డి విరిగే భారం

“ఎద్దు పుండు కాకికి ముద్దు” అని సామెత. గ్రీసు అప్పు సంక్షోభం యూరప్‌లోని ధనిక దేశాల ప్రైవేటు బహుళజాతి గుత్త సంస్ధలకు సిరులు కురిపించబోతోంది. అదే సమయంలో గ్రీసు ప్రజలకు “పెనం మీదినుండి పొయ్యిలోకి జారిన” పరిస్ధితి దాపురిస్తోంది. గ్రీసు మరిన్ని పొదుపు చర్యలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, లేనట్లయితే రెండో బెయిలౌట్ ప్యాకేజి ఇచ్చేది లేదని నెలరోజుల నుండి బెదిరిస్తూ వచ్చిన ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు తాము కోరింది సాధించుకుని రెండో బెయిలౌట్‌ ఇవ్వడానికి…

గూగుల్‌పై యాంటీ-ట్రస్ట్ కేసు నమోదు చేస్తాం -అమెరికా ఎఫ్.టి.సి

యాంటీట్రస్ట్ చట్టం కింద గూగుల్ నేరానికి పాల్పడినట్లుగా అమెరికా “ఫెడరల్ ట్రేడ్ కమిషన్” భావిస్తోంది. ఈ చట్టం కింద గూగుల్‌పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించడానికి నిర్ణయించినట్లు ఎఫ్.టి.సి తెలిపింది. మరికొద్ది రోజుల్లో గూగుల్‌కి కోర్టు ఆర్డర్లు అందనున్నాయి. తన సెర్చి ఇంజన్ వ్యాపారం ద్వారా తన వెబ్‌సైట్లకు, తాను అందిస్తున్న ఇంటర్నెట్ సేవలకు వినియోగదారులను ఆకర్షిస్తున్నదని గూగుల్ పై అనేక ఇంటర్నెట్ సంస్ధలు చాలా కాలం నుండి ఆరోపణలు చేస్తున్నాయి. ఈ ఆరోపణల నేపధ్యంలో…

సంక్షుభిత యూరోజోన్ దేశాల జాబితాలో నెదర్లాండ్స్ -ఐ.ఎం.ఎఫ్

యూరోజోన్ లోని బలహీన దేశాలు తీవ్ర అప్పు సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నాయి. గ్రీసు, ఐర్లండులు గత సంవత్సరమే సంక్షోభంలో ఉన్నట్లు తేలిపోగా, ఈ సంవత్సరం పోర్చుగల్ కూడా సంక్షోభ దేశంగా బైటపడి, ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లనుండి బెయిలౌట్ ప్యాకేజి పొందింది. పోర్చుగల్ తర్వాత స్పెయిన్, ఇటలీ దేశాలు తదుపరి సంక్షోభ దేశాలుగా మార్కెట్ పండితులు అంచనా వేస్తుండగా, ఈ జాబితాకి తాజాగా నెదర్లాండ్స్‌ను కూడా ఐ.ఎం.ఎఫ్ జత చేసింది. స్పెయిన్, ఇటలీలు గ్రీసు, ఐర్లండ్, పోర్చుగల్‌లతో పోలిస్తే…

గ్లోబల్ ఆయిల్ ధరల తగ్గుదల ప్రజలకు అందకుండా అడ్డుపడుతున్న భారత ప్రభుత్వం

భారత ప్రభుత్వం సంవత్సరం క్రితం పెట్రోల్ ధరలను డీకంట్రోల్ చేసింది. అంటే పెట్రోల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణను ఎత్తివేసింది. ఫలితంగా గ్లోబల్ మార్కెట్‌లో ఆయిల్ ధరలు పెరిగినప్పుడల్లా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. డీకంట్రోల్ చేశాక ఇప్పటివరకు పెట్రోల్ ధర 23 శాతం పెరిగింది. ప్రభుత్వం ఇంతకుముందు సబ్సిడీ రూపంలో ఆయిల్ ధరలో కొంత భారం భరించడం వలన ప్రజలకు ప్రభుత్వం భరించినంతమేరకు తక్కువ ధరకు ప్రజలకు ఆయిల్ లభించేది. నిజానికి పెట్రోల్‌ను దిగుమతి ధరలకే ప్రజలకు ఇచ్చినట్లయితే…

ఆఫ్ఘనిస్ధాన్‌నుండి సైన్యం ఉపసంహరణలో అమెరికాతో పాటే ఫ్రాన్సు కూడా

ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ నుండి సైన్యాన్ని మొదటి దశలో మూడువిడతలుగా 33,000 మంది సైనికులను ఉపసంహరించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫ్రాన్సు అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ కూడా అమెరికాను అనుసరించనున్నట్లు ప్రకటించాడు. తమ సైనికుల్ని కూడా ఉపసంహరిస్తామని ప్రకటించింది. ఐతే, అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో సైనికులను ఆఫ్ఘనిస్ధాన్‌ దురాక్రమణకు పంపిన ఇంగ్లండు ఇంతవరకూ ఈ విషయమై ఏ ప్రకటనా చేయకపోవడం విశేషం. అమెరికా ఉపసంహరించునే సైనికుల సంఖ్యకు దామాషాలో తాము తమ…