ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికోసం ముగ్గురు మిగిలారు

రేప్ ప్రయత్నం నేరంపై స్ట్రాస్ కాన్ అరెస్టు ఐన తర్వాత ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టరు పోస్టుకి పోటీ ఏర్పడింది. ఇప్పటివరకూ అమెరికా ప్రపంచ బ్యాంకు అధిపతిని నియమించుకుంటే, యూరప్ ఐ.ఎం.ఎఫ్ అధిపతిని నియమించుకునేవి. ఇప్పుడు ఎమర్జింగ్ దేశాలైన చైనా, ఇండియా, దక్షీణాఫ్రికాలు పోటీ పడుతున్నాయి. ఫ్రాన్సు ఆర్ధిక మంత్రి క్రిస్టీన్ లాగార్డే ఈ పదవికి ఎన్నిక కావచ్చని అంచనా వేస్తుండగా ఆమెకు పోటీ ఎదురవుతోంది. ఇండియా ఆమె అభ్యర్ధిత్వానికి మద్దతు ఇవ్వలేదు. చైనా ఏమీ చెప్పడం లేదు.…

భారతదేశ ఆర్ధికవృద్ధికి ఫ్యాక్టరీలు, సాఫ్టువేర్, వ్యవసాయం లలొ ఏది కీలకం?

ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ గా పరిగణింపబడుతున్న భారత దేశం చైనా తర్వాత అత్యధిక వేగంతో ఆర్ధిక వృద్ధి (జిడిపి పెరుగుదల రేటు) సాధిస్తున్న దేశంగా గుర్తింపు పొందింది. భారత దేశంలో సేవల రంగం (ప్రధానంగా సాఫ్టువేర్, ఆ తర్వాత బ్యాంకింగ్, ఇన్సూరెన్సు లు కూడా సేవల రంగం కిందికే వస్తాయి) అభివృద్ధి చెందింది. ప్రధానంగా సావ్ట్ వేర్ రంగం అభివృద్ధి చెందిన ఫలితంగా కంప్యూటర్ రంగంలో ఔట్ సోర్సింగ్ కి ఇండియా కేంద్రంగా మారింది. నూతన ఆర్ధిక…

కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియా, మన్మోహన్ ల నేతృత్వంలో గ్రూపులున్నది నిజమేనా?

భారత దేశం ఎమర్జింగ్ ఎకానమీగా చెలామణి అవుతోంది. చైనా తర్వాత అత్యధిక జిడిపి వృద్ధి రేటు నమోదు చేస్తోంది. ఇంకా చెప్పాలంటే చైనా అధిగమించాలని కలలు కంటోంది. చైనాకు పోటీదారుగా చెప్పుకుంటున్నప్పటికీ చైనా వివిధ రంగాల్లో సాధిస్తున్న ఆర్ధిక ప్రగతితో పోలిస్తే ఇండియా ప్రగతి చాలా దూరంలోనే ఉంది. చైనా ప్రపంచంలో అమెరికా తర్వాత రెండవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ కాగా ఇండియా 11 వ స్ధానంలొ ఉంది. ఆసియాలో చూస్తే చైనా మొదటి స్ధానంలో ఉండగా…

పోస్కో (POSCO) కంపెనీ కోసం ప్రభుత్వాల పచ్చి అబద్ధాలు, అరాచకాలు

పోస్కో కంపెనీ ప్రాజెక్టు: ఇది దక్షిణ కొరియాకి చెందిన బహుళజాతి కంపెనీ. భారత దేశంలో సంవత్సరానికి నాలుగు మిలియన్ టన్నుల ఉక్కుని ఉత్పత్తి చేస్తానని 2005 లో భారత దేశంలో ఒప్పందం కుదుర్చుకుంది. 12 బిలియన్ డాలర్ల (రు. 52,000 కోట్లు) పెట్టుబడి ఈ ప్రాజెక్టు రూపంలో ఇండియాకి వస్తుంది. ఇండియాకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఒకే కంపెనీకి ఇంత పెట్టుబడి మరి దేనికీ రాలేదు. ప్రాజెక్టు కట్టడం కోసం ఇది ఒడిషాలోని జగత్‌సింగ్ పూర్…