ఇరాన్ తర్వాత సిరియాపై అణు దౌర్జన్యం చేస్తున్న అమెరికా, పశ్చిమ దేశాలు -గ్రాఫిక్స్

ఇరాన్ అణు బాంబులు తయారు చేయడానికే యురేనియం శుద్ధి చేస్తున్నదంటూ ఇరాన్ అణు కార్యక్రమాన్ని అనేక సంవత్సరాలనుండి రాజకీయ, వాణిజ్య ఆంక్షలు అమలు చేస్తున్న అమెరికా తదితర పశ్చిమ దేశాలు తాజాగా సిరియాపై కూడా అదే తరహా ఎత్తుగడను అమలు చేస్తున్నాయి. ఇరాన్‌పై చేసినట్లే సిరియాపై కూడా అణు దౌర్జన్యం చేయడానికి సిద్ధపడుతున్నాయి. తమకు లొంగని దేశాలపై ఏదో ఒక పేరుతో అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలు విధించి ఆ దేశాల ప్రజల ఉసురు తీసే నరహంతక పశ్చిమ…

నష్ట పోతావ్! గూగుల్‌కి చైనా అధికార పత్రిక హెచ్చరిక

చైనా ప్రభుత్వంపై పరోక్షంగా హేకింగ్ ఆరోపణలు సంధించిన గూగుల్ సంస్ధకు చైనా ప్రభుత్వం తన అధికారిక పత్రిక ద్వారా స్పందించింది. అమెరికా, చైనాల మధ్య ఉన్న రాజకీయ విభేధాలను స్వప్రయోజనాలకు వినియోగించుకోవలని చూస్తే “నష్టపోతావ్!” అని పీపుల్స్ డైలీ పత్రిక హెచ్చరించింది. విదేశాల్లో పంపిణీకి వెలువడే పీపుల్సు డైలీ పత్రిక మొదటి పేజీలో రాసిన సంపాదకీయంలో ఈ హెచ్చరిక చేసింది. తన ఆరోపణల ద్వారా గూగుల్ తన వ్యాపారావకాశాలకు ప్రమాదం తెచ్చుకుంటోందని పత్రిక హెచ్చరించింది. గూగుల్ ఈ…

పౌరసమాజ నాయకులను ఐక్యం చేసిన రామ్‌దేవ్ అరెస్టు, లాఠీ ఛార్జీ

ఆదివారం వేకువ ఝామున బాబా రాందేవ్ ఆమరణ నిరాహార దీక్షా శిబిరంపై పోలీసులు దాడి చేయడమే కాకుండా, టియర్ గ్యాసు ప్రయోగించి, లాఠీ ఛార్జీ కూడా చేయడంతో అప్పటివరకు వివిధ కారణాలతో ఎడమొగం పెడమొగం గా ఉన్న పౌర సమాజ నాయకులుగా మన్ననలు అందుకుంటున్నవారిని ఏకం చేసింది. రాం దేవ్ దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేసి ముప్ఫై మందిక పైగా కార్యకర్తలను గాయపరచడాన్ని అన్నా హజారే, అరుణా రాయ్, కేజ్రివాల్ తదితరులు తీవ్రంగా ఖండించారు. కనీసం నిరసన…

దయానిధి మారన్ హీరోగా మరో కొత్త టెలికమ్ కుంభకోణం

కరుణానిధి బంధువు, కేంద్ర మాజీ టెలికం మంత్రి దయానిధి మారన్ ప్రధాన పాత్రధారుడుగా మరో సరికొత్త టెలికం కుంభకోణం వెల్లడయ్యింది. తెహెల్కా పత్రిక ద్వారా వెల్లడయిన ఈ కుంభకోణం విలువ 700 కోట్ల రూపాయలు. తాను కేంద్రంలో టెలికం శాఖ మంత్రిగా ఉండగా తమిళనాడులోని ఎయిర్ సెల్ అనే కంపెనీకి టెలికం లైసెన్సులు రాకుండా సంవత్సరాల తరబడి దయానిధి మారన్ అడ్డుకున్నాడని తెహెల్కా పత్రిక బైట పెట్టింది. తన మిత్రుడికి చెందిన మలేషియా కంపెనీ మాక్సిస్‌కి ఎయిర్…

లోక్‌పాల్ బిల్లుపై కేంద్రం సీరియస్‌గా లేదు, మరోసారి నిరాహార దీక్ష చేస్తా! -అన్నా హజారే

కేంద్ర ప్రభుత్వ హామీని నమ్మి తన నాలుగు రోజుల నిరాహార దీక్షను విరమించిన అన్నా హజారేకు కేంద్ర ప్రభుత్వం అసలు స్వరూపం మెల్ల మెల్లగా అర్ధం అవుతోంది. అవినీతి ప్రభుత్వాలు ఇచ్చే హామీలు ఒట్టి గాలి మూటలేనని తెలిసి వస్తోంది. ఎన్నికల మేనిఫేస్టో పేరిట లిఖిత హామిలు ఇచ్చి పచ్చిగా ఉల్లంఘించే భారత దేశ రాజకీయ పార్టీలు ఒక సత్యాగ్రహవాదికి ఇచ్చిన హామీలను ఉల్లంఘించడం, ఉఫ్… అని ఊదిపారేయడం చిటికేలో పని అని గతం కంటే ఇంకా…