ద్వవ్యోల్బణం అరికట్టే పేరుతో లక్షల కుటుంబాల జీవనోపాధికి ప్రభుత్వం ఎసరు

అనుకున్నదే జరగబోతోంది. భారత దేశంలోని లక్షల కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీయడానికి భారత ప్రభుత్వం రెండో అడుగు వేసింది. ద్రవ్యోల్బణాన్ని అరి కట్టడమే తమ ప్రధమ కర్తవ్యం అంటూ రెండేళ్ళనుండి ఆందోళన వ్యక్తం జేస్తూ కూడా ఆ దిశలో ఏ చర్యా తీసుకోని ప్రభుత్వం ఇప్పుడు తన ఆందోళన వెనక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని బైటపెట్టుకుంది. ప్రధాన మంత్రి ఆర్ధిక సలహాదారుల బృందానికి అధిపతి అయిన కౌశిక్ బసు శుక్రవారం ప్రభుత్వ ఉద్దేశ్యాలను మెల్లగా బైటపెట్టాడు. భారత దేశ…

అసభ్యకర టి.వి. ప్రకటనలను ప్రసారం చేయవద్దని ఛానెళ్ళను కోరిన ప్రభుత్వం

భారత సమాచార మంత్రిత్వ శాఖ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. పచ్చిగా, అసభ్యకరంగా లైంగిక ప్రకటనలను ప్రసారం చేయవద్దని టి.వి చానళ్ళకు ఆదేశాలు జారీ చేసింది. డియోడెరంట్ అమ్మకం దారులు తమ ఉత్పత్తుల అమ్మకాల కోసం జారీ చేస్తున్న వీడియో ప్రకటనలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని ప్రత్యక్షంగా లైంగికతలను ప్రదర్శించే ప్రకటనలు భారత దేశ ప్రచార, ప్రసార చట్టాలను ఉల్లంఘించేవిగా ఉన్నాయనీ, వీటిని ప్రసారం చేయడం వెంటనే ఆపాలని తన ఆదేశాల్లో ప్రభుత్వం కోరించి. అటువంటి ప్రకటనలు…

ఒక తీవ్రవాది, ఒక స్నేహబంధం, కొన్ని కార్టూన్లు

అమెరికాకీ, అమెరికా వాదనని నమ్మినవారికీ ఒసామా బిన్ లాడెన్ నెం. వన్ తీవ్రవాది. దక్షీణాసియాలో అమెరికాకి పాకిస్ధాన్ అత్యంత నమ్మకమైన మిత్రుడు. వారిది ఆరు దశాబ్దాల స్నేహబంధం. లాడెన్‌ని వెతకటంలో తన మిత్రుడు సహాయపడుతున్నాడని అమెరికా సెప్టెంబరు 11, 2001 నుండి ఇప్పటి వరకు 20.7 బిలియన్ డాలర్లను పాకిస్ధాన్‌కి ధారపోసింది. పది సంవత్సరాల నుండీ వెతుకుతున్న తన శత్రువు తన మిత్రుడి బెడ్ రూంలోనే హాయిగా సేద తీరడం చూసిన అమెరికా బిత్తరపోయింది. మిత్రుడుగా భావిస్తున్న…

16 సం. నాన్ బెయిలబుల్ వారంట్ తప్పించుకొని ఇప్పుడు లొంగిపోయిన బీహార్ ఎం.ఎల్.ఎ

ఆయన పేరు రామాధర్ సింగ్. బీహార్‌లో బి.జె.పి పార్టీ తరఫున ఔరంగాబాద్ నియోజక వర్గం నుండి నాలుగుసార్లు ఎన్నికయిన ఎం.ఎల్.ఎ. 2010 లో ఎన్నికయ్యాక నితీష్ కుమార్ ప్రభుత్వంలో సహకార శాఖా మంత్రిగా పని చేస్తున్నాడు. ఈయన గురువారం మంత్రి పదవికి రాజీనామ చేశాడు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సలహా మేరకు గవర్నర్ ఆ ఎం.ఎల్.ఏ రాజీనామాని ఆమోదించాడు. మే 19న రాజీనామా చేశాక బీహార్ హై కోర్టు ఆయనను క్రింది కోర్టులో లొంగిపొమ్మని ఆదేశాలు ఇచ్చింది.…