పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు, పలువురు దుర్మరణం

ఆదివారం పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపి పలువురిని పొట్టన బెట్టుకుంది. ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న పాలస్తీనా భూభాగాలపైకి పాలస్తీనీయులు రావడంతో ఎటువంటి హెచ్చరికలు లేకుండా ఇజ్రాయెల్ సైన్యం, సిరియా, గాజాలతో ఉన్న సరిహద్దులోని గ్రామాల్లో కాల్పులు జరిపింది. కడపటి వార్తల ప్రకారం పన్నెండు మంది చనిపోయారని బిబిసి, రాయిటర్స్ వార్తా సంస్ధలు తెలిపాయి. ఇజ్రాయెల్ యధావిధిగా ఇరాన్‌ని ఆడిపోసుకుంది. ఇరాన్ రెచ్చగొడినందువల్లనే పాలస్తీనియులు తాము ఆక్రమించుకున్న పాలస్తీనా భూభాగాల్లోకి చొచ్చుకు వచ్చారని ఆరోపించింది. పనిలొ పనిగా…

లైంగిక ఆరోపణల కేసులో అరెస్టయిన ఐ.ఎం.ఎఫ్ అధ్యక్షుడు స్ట్రాస్ కాన్

చివరికి ఐ.ఎం.ఎఫ్ అధ్యక్షుడు కూడా తానూ మ(మృ)గాడినే అని నిరూపించుకున్నాడు. ఫ్రాన్సు దేశీయుడు, అంతర్జాతీయ ద్రవ్య సంస్ధ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ -ఐ.ఎం.ఎఫ్) అధ్యక్షుడు ‘డొమినిక్ స్ట్రాస్ కాన్’ ఒక లగ్జరీ హోటల్ లోని మెయిడ్ పై అత్యాచారానికి పూనుకున్నాడన్న నేరంపై న్యూయార్కులోని కెన్నెడీ విమానాశ్రయంలో అరెస్టు అయ్యాడు. ఫ్రాన్సులో త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ తరపున నికొలస్ సర్కోజీపై నిలబడి గెలుస్తాడని అందరూ భావిస్తున్న దశలో తాజా సంఘటన జరిగింది. 2007 నుండీ…