పాకిస్ధాన్ సైనికాధికారులను “మోస్ట్ వాంటెడ్” జాబితాలో చేర్చిన ఇండియా

భారత ప్రభుత్వం గత మార్చి నెలలో పాకిస్ధాన్ ప్రభుత్వానికి సమర్పించిన వాంటెడ్ వ్యక్తుల జాబితాలో ప్రస్తుతం సైన్యంలో అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారి పేర్లు ఉన్న సంగతి వెల్లడయ్యింది. ఇండియా తన భూభాగంపై జరిగిన టెర్రరిస్టు దాడుల వెనక పాకిస్ధాన్ సైనికాధికారులు, మిలట్రీ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ పాత్ర ఉందని చాలా కాలంనుండి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇండియా హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి జి.కె.పిళ్ళై మార్చి నెలలో పాకిస్ధాన్ హోమ్ కార్యదర్శి ఖమర్ జమాన్ చౌదరితో…

లిబియా విభజన వైపుగా యూరోపియన్ యూనియన్ చర్యలు?

లిబియాలో అంతర్యుద్ధాన్ని అడ్డు పెట్టుకుని ఆ దేశాన్ని రెండుగా విభజించేవైపుగా యూరోపియన్ యూనియన్ చర్యలు ప్రారంభించినట్టు కనిపిస్తోంది. తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న లిబియా తూర్పు ప్రాంతానికి కేంద్రంగా ఉన్న బెంఘాజీ పట్టణంలో తన కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నది. బెంఘాజీ లిబియాలో రెండవ అతి పెద్ద పట్టణం. తిరుగుబాటుదారులుగా చెప్పబడుతున్న వారు ఇక్కడినుండే తమ చర్యలను ప్రారంభించారు. ఒకప్పుడు గడ్డాఫీ సైన్యంలో అధికారులుగా ఉన్న వారిని అమెరికా ఆకర్షించి గడ్డాఫీపై కొద్ది సంవత్సరాల క్రితం తిరుగుబాటు చేయించింది. అది విఫలమయ్యింది.…

అమెరికా వెతికిందెక్కడ? లాడెన్ దొరికిందెక్కడ?

సెప్టెంబర్ 11, 2001 న న్యూయార్కు నగరంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కార్యాలయం ఉన్న జంట టవర్లను ముస్లిం టెర్రరిస్టులుగా చెప్పబడుతున్నవారు అమెరికా విమానాలతో ఢీ కొట్టారు. విమానాలు ఢీకొట్టాక రెండు టవర్లు ఒక పద్ధతి ప్రకారం కూలిపోయిన దృశ్యాన్ని ప్రపంచం అంతా వీక్షించింది. కొన్ని గంటల్లోనే టవర్లను ఢీకొన్న విమానాలను నడిపినవారిని ఆ పనికి పురమాయించిందెవరో అమెరికా కనిపెట్టి ప్రకటించింది. ఆఫ్ఘనిస్ధాన్‌లో తాలిబాన్ ప్రభుత్వ రక్షణలొ ఉన్న ఒసామా బిన్ లాడెన్ ఆదేశాల ప్రకారమే టవర్లను…