మధ్యధరా సముద్రంలో 63 మంది శరణార్ధులను వారి చావుకు వదిలేసిన నాటో యుద్ధనౌక

లిబియా పౌరుల రక్షణే తమ ధ్యేయమనీ, వారిని రక్షించండి అని ఆదేశించిన సమితి తీర్మానాన్ని పూర్తిగా అమలు చేయడమే తమ కర్తవ్యమనీ నాటో ఆధ్వర్యంలో లిబియాపై బాంబులు మిస్సైళ్ళుతో దాడులు చేస్తున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాలు చెబుతున్నాయి. గడ్డాఫీ ఇంటిపై బాంబులేసి అతన్ని చంపాలని ప్రయత్నించినా, అతని కొడుకూ, ముగ్గురు మనవళ్ళను చంపినా, ప్రభుత్వ ఆయుధ గిడ్డంగులను నాశనం చేసినా, చివరికి లిబియా పౌరులే చనిపోయినా అవన్నీ అంతిమంగా లిబియా పౌరుల రక్షణకోసమే నని ఆ…

గడ్డాఫీని మరోసారి టార్గెట్ చేసిన నాటో దాడులు, కొనసాగుతున్న ప్రతిష్టంభన

లిబియా ప్రజలను రక్షించే పేరుతో విచక్షణారహితంగా లిబియాపై వైమానికి దాడులు చేస్తున్న నాటో దళాలు మంగళవారం మరోసారి గడ్డాఫీ నివాస కాంపౌండ్‌పై పలు క్షిపణులతో దాడి చేశాయి. ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ రాయిటర్స్ ఈ వార్తను ప్రచురించింది. ఏప్రిల్ 30 తేదీన నాటో బాంబు దాడుల్లో గడ్డాఫీ చివరి కొడుకుతో పాటు ముగ్గురు మనవళ్ళు చనిపోయాక గడ్డాఫీ బహిరంగంగా ఇంతవరకు కనపడలేదు. క్షిపణి దాడుల వలన అద్దాలు పగిలి చెల్లాచెదురు కావడంతో అవి తగిలి నలుగురు పిల్లలు…

మసీదు-మందిరం తీర్పుని సస్పెండ్ చేసిన సుప్రీం కోర్టు

వివాదాస్పద బాబ్రీ మసీదు, రామ జన్మ భూమి స్ధలాన్ని మూడు భాగాలు చేసి పంచిన అలహాబాద్ హై కోర్టు తీర్పును సుప్రీం కోర్టు సస్పెన్షన్‌లో ఉంచింది. మూడు భాగాలుగా పంచడం వెనక హై కోర్టు ఇచ్చిన కారణాలను ఇద్దరు సభ్యులు గల సుప్రీం బెంచ్ ప్రశ్నించింది. బాబరు నిర్మించాడని చెబుతున్న మసీదును ఒక హిందూ దేవాలయాన్ని కూల్చి నిర్మించినట్లుగా ఆరోపిస్తూ 1992 డిసెంబరు 6 తేదీన హిందూ మత సంస్ధలకు చెందిన కార్యకర్తలు కూల్చివేశిన విషయం విదితమే.…