ఒసామా హత్యను నిర్ధారించిన ఆల్-ఖైదా, శవం అప్పగించాలని డిమాండ్

ఒసామా-బిన్-లాడెన్‌ నిజంగా అమెరికా కమెండోల దాడిలో చనిపోయాడా లేదా అన్న అనుమానాలకు తెర దించుతూ అతను చనిపోయిన విషయాన్ని ఆల్-ఖైదా సంస్ధ నిర్ధారించింది. లాడెన్ శవాన్ని అప్పగించాలని ఆల్-ఖైదా డిమాండ్ చేసింది. శవాన్ని అరేబియా సముద్రంలో పాతిపెట్టామంటున్న అమెరికా మాటలను ఆల్-ఖైదా నమ్మడం లేదని ఈ డిమాండ్ ద్వారా అర్ధం చేసుకోవచ్చునా లేక శవం పాతిపెట్టిన చోటుని చెప్పాలని ఈ డిమాండ్ అంతరార్ధమో తెలియడం లేదు. ఒసామా-బిన్-లాడెన్ హత్యకు అమెరికా పైనా, దాని మిత్రుల పైనా ప్రతీకారం…

అమెరికా అబద్ధాలకు నిలువెత్తు సాక్ష్యాలు: జెస్సికా లించ్, పేట్ టిల్‌మేన్, లిండా నార్గ్రోవ్

ఒసామా బిన్ లాడెన్ హత్య విషయంలో పొంతనలేని కధనాలు చెబుతున్న అమెరికాకి అబద్ధాలు చెప్పడం కొత్త కాదు. ఇరాక్‌పై దాడి చేయడానికి కారణంగా ఆ దేశంలో సామూహిక విధ్వంసక మారణాయుధాలు ఉన్నాయనీ, వాటి వలన అమెరికా భద్రతకు ముప్పు అనీ అబద్ధాలు చెప్పింది. దానితో పాటు ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌కీ, ఒసామా బిన్ లాడెన్‌కీ సంబంధాలున్నాయని పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేసింది. కానీ లాడెన్‌ను చంపానని చెప్పిన తర్వాత అమెరికా అధ్యక్షుడు గానీ, అధికారులు గానీ…

ఐ.ఎం.ఎఫ్, ఇ.యుల బెయిలౌట్‌తో రిసెషన్‌లోకి జారనున్న పోర్చుగల్

గ్రీసు, ఐర్లండ్‌ దేశాల తర్వాత పోర్చుగల్ అప్పు సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి విదితమే. ఐ.ఎం.ఎఫ్, యూరోపియన్ యూనియన్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆర్ధిక సహాయ నిధి నుండి బెయిలౌట్ ప్యాకేజి పొందే అవసరం లేదని పోర్చుగల్ మొదట చెప్పినప్పటికీ, పార్లమెంటులో బడ్జెట్ బిల్లు ఓడిపోయి ప్రభుత్వం కూలిపోవడంతో బాండ్ మార్కెట్లో పోర్చుగల్ సావరిన్ అప్పుపై వడ్డీ పెరిగిపోయి అప్పు సేకరించడం అసాధ్యంగా మారిపోయింది. దానితో అనివార్యంగా పోర్చుగల్ ఆపద్ధర్మ ప్రధాని జోస్ సోక్రటీసు గత నెల ప్రారంభంలో…

ఇండియాతో ఘర్షణ పెట్టుకుని ఒసామా హత్యపై దృష్టి మరల్చే యోచనలో పాకిస్ధాన్?

పాకిస్ధాన్ భూభాగంపై స్ధావరం ఏర్పరుచుకున్న ఒసామా బిన్ లాడెన్‌ను చంపామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించడంతో పాకిస్ధాన్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. పాకిస్ధాన్ ప్రభుత్వానికి తెలియకుండా అమెరికా ఆపరేషన్ నిర్వహించిందనడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికీ ఇన్నాళ్ళూ ఒసామా పాకిస్ధాన్‌లోనే ఆశ్రయం తీసుకుంటున్న విషయం తెలిసి పాకిస్ధానీయులు నిశ్చేష్టులయ్యారని పత్రికలు తెలుపుతున్నాయి. పాకిస్ధాన్ ఐ.ఎస్.ఐ సంస్ధ లాడెన్‌ను తప్పిస్తుందేమో అన్న అనుమానాలున్నందునే పాక్ ప్రభుత్వానికి తెలియజేయలేదని సి.ఐ.ఏ డైరెక్టర్ చెప్పడంతో పాకిస్ధాన్‌లోని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్త్తున్నాయి.…

లాడెన్ ఇంటిలో రక్తపు మడుగులో ముగ్గురు నిరాయుధుల శవాలు, ఫోటోలు సంపాదించిన రాయిటర్స్

ఒసామా బిన్ లాడెన్‌ స్ధావరంగా చెప్పబడుతున్న ఇంటిలో రక్తపు మడుగులో పడి ఉన్న ముగ్గురు యువకుల శవాల ఫోటోలను రాయిటర్స్ వార్తా సంస్ధ సంపాదించింది. వీరి వద్ద ఎటువంటి ఆయుధాలు లేవని రాయిటర్స్ సంస్ధ తెలిపింది. అమెరికా కమేండోలు దాడి చేసి వెళ్ళిన గంట తర్వాత ఈ ఫోటోలు తీశారని ఆ సంస్ధ తెలిపింది. పాకిస్ధాన్ భద్రతా అధికారి ఒకరు ఒసామా స్ధావరంగా చెబుతున్న ఇంటిలోకి అమెరికన్ కమెండోలు వెళ్ళిన గంట తర్వాత వెళ్ళి తీసిన ఫోటోలను…