ఆర్.బి.ఐ ద్రవ్యవిధానం దెబ్బకి భారీగా నష్టపోయిన ఇండియా షేర్‌మార్కెట్

భారత ద్రవ్య విధానం సమీక్షలో రెపో, రివర్స్ రెపో రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేరకు ఆర్.బి.ఐ పెంచడంతో ప్రధాన షేర్ మార్కెట్ సూచికలు భారీగా నష్టపోయాయి. బోంబే స్టాక్‌ ఎక్ఛేంజి (సెన్సెక్సు) 463.33 పాయింట్లు (2.44 శాతం) నష్టపోయి 18,534.69 వద్ద క్లోజ్ కాగా నేషనల్ స్టాక్ ఎక్ఛేంజి 136.05 పాయింట్లు (2.39 శాతం) నష్టపోయి 5,565.25 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. వరుసగా ఏడురోజుల పాటు నష్టపోవడం నవంబరు 2008 తర్వాత ఇదే మొదటిసారి అని…

వడ్డీరేట్లు మళ్ళీ పెంచిన ఆర్.బి.ఐ, ద్రవ్యోల్బణం పైనే దృష్టి

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తన బెంచ్ మార్కు వడ్డీ రేట్లను మరోసారి పెంచింది. విశ్లేషకుల అంచనాల కంటే ఎక్కువగా పెంచడంద్వారా దేశంలో ద్రవ్యోల్బణం ప్రమాదకర స్ధాయిలో ఉన్న విషయాన్ని తెలియజెప్పింది. దాంతో పాటు ద్రవ్యోల్బణం తగ్గించడమే తన ద్రవ్యవిధానం ప్రధాన కర్తవ్యమని చాటి చెప్పింది. ప్రతి సంవత్సరం ద్రవ్యవిధానాన్ని అర్.బి.ఐ నాలుగు సార్లు సమీక్షిస్తుంది. ద్రవ్యోల్బణం కట్టడి కావడానికి అవసరమైతే అంతకంటే ఎక్కువ సార్లు కూడా సమీక్షించడానికి ఆర్.బి.ఐ గత సంవత్సరం నిర్ణయించింది. తాజాగా మంగళవారం…