పాక్‌తో చెలిమి ఇండియాతో ఆయుధ వ్యాపారానికి చేటు -అమెరికా రాయబారి (వికీలీక్స్)

పాకిస్ధాన్‌తో అమెరికాకి ఉన్న స్నేహం వలన ఇండియాతో జరిపే ఆయుధ వ్యాపారంలో ఆటంకాలు ఏర్పడవచ్చని ఇండియాలోని అమెరికా రాయబారి అమెరికా మిలట్రీ అధికారులను హెచ్చరించిన సంగతి వికీలీక్స్ వెల్లడి చేసిన డిప్లొమాటిక్ కేబుల్స్ ద్వారా బయటపడింది. అమెరికా ఆయుధాల అమ్మకానికి పోటీగా వచ్చే ఇతర దేశాల కంపెనీలు, పాకిస్ధాన్‌తో అమెరికాకి గల స్నేహం గురించి ఇండియాను హెచ్చరించవచ్చనీ, అందువలన కీలకమైన సమయంలో ఇండియాకి అవసరమైన మిలట్రీ విడిభాగాలు, మందుగుండుల సరఫరాను అమెరికా ఆపేయవచ్చని ఇండియాకు నూరిపోయడం ద్వారా…

దురాక్రమణ సేనలపై వేసవి దాడులు మొదలుపెడతాం -తాలిబాన్

ఆఫ్ఘనిస్ధాన్‌ని ఆక్రమించిన అమెరికా, తదితర పశ్చిమ దేశాల దురాక్రమణ సేనలపై ఆదివారం నుండి తాజా దాడులు ప్రారంభిస్తున్నామని తాలిబాన్ ప్రకటించింది. దురాక్రమణ సేనలు, వారి గూఢచారులు, దురాక్రమణ దేశాల తొత్తు ప్రభుత్వ అధికారులు, వారి సైనికులపై దాడులు చేస్తామని తాలిబాన్ ప్రకటించింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ జోడు టవర్లను విమానాలతో కూల్చింది ఆల్-ఖైదా మిలిటెంట్లేనని నిశ్చయించుకున్న అమెరికా ఆల్-ఖైదాని అంతమొందించే పేరుతో ఆఫ్ఘనిస్ధాన్ పై దురాక్రమణదాడి చేసిన సంగతి విదితమే. ఆల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్…

గాజా సరిహద్దును శాశ్వతంగా తెరవడానికి నిర్ణయించిన ఈజిప్టు

అరబ్ ప్రజా ఉద్యమాలకు మరో బోనస్. ఈజిప్టులోని మధ్యంతర ప్రభుత్వం గాజాతో ఉన్న రఫా సరిహద్దును శాశ్వత ప్రాతిపదికన తెరిచి ఉంచడానికి నిర్ణయించింది. పాలస్తీనా వైరి పార్టీల మధ్య ఊహించని విధంగా ఒప్పందం కుదరడానికి సహకరించిన ఈజిప్టు ప్రభుత్వం గాజా సరిహద్దును తెరవాలని నిర్ణయించడం అభినందనీయం. అయితే అరబ్ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌తో కొనసాగుతున్న (అ)శాంతి ఒప్పందం కూడా రద్ధు చేసుకుంటే ఈజిప్టు ప్రభుత్వానికి ప్రపంచవ్యాపితంగా ప్రశంసలు అందుతాయి. కానీ అమెరికానుండి సంవత్సరానికి 1 బిలియన్…

అరబ్ ప్రజా ఉద్యమాలకు బోనస్, పాలస్తీనా వైరివర్గాల మధ్య శాంతి ఒప్పందం

ఈజిప్టు, ట్యునీషియాలలో నియంతలను తరిమికొట్టిన ప్రజా ఉద్యమాలు తమవరకు పూర్తి విజయం సాధించలేక పోయినా, తమ పొరుగు అరబ్బులు పాలస్తీనీయుల మధ్య శుభప్రదమైన శాంతి ఒప్పందం కుదరడానికి దోహదపడ్దాయి. ఇజ్రాయెల్ దురాక్రమణలో ఉన్న పాలస్తీనాకు స్వతంత్రం సాధించడానికి పోరాడుతున్న ఫతా, హమాస్ పార్టీల మధ్య తీవ్ర వైరం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈజిప్టులో ఏర్పడిన మద్యంతర ప్రభుత్వం మధ్యవర్తిత్వంతో వైరి పక్షాల మధ్య సంబంధాలు మెరుగుపడే దిశలో ప్రయత్నాలు మొదలయ్యాయి. దానిలో మొదటి అడుగుగా ఇరుపక్షాలూ సహకరించుకోవడానికి…