టిబెటన్లపై కొనసాగుతున్న చైనా ప్రభుత్వ అణచివేత చర్యలు

టిబెటన్లపై చైనా ప్రభుత్వ అణచివేత చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా పశ్చీమ్ చైనాలోని బౌద్దుల మొనాస్టరీపై చైనా పోలీసులు దాడి చేశారు. పోలీసుల దాడిలో ఇద్దరు టిబెట్ వృద్ధులు చనిపోయారు. కృతి మొనాస్టరీ పై దాడి చేసిన పోలీసులు అక్కడ ఉన్న బౌద్ధ మత గురువులను అరెస్టు చేయకుండా అడ్డుకున్న ఒక వృద్ధుడు, మరో వృద్ధురాలు పోలీసుల బలప్రయోగంలో చనిపోయారు. “ఇంటర్నేషనల్ కాంపెయిన్ ఫర్ టిబెటన్స్‌” (ఐ.సి.టి) సంస్ధ ఈ విషయం తెలియజేసింది. మార్చి 16 న టిబెట్…

మిస్రాటాను కాపాడండి, లేదా మేమే కాపాడుకుంటాం! లిబియా ఆర్మీకి గిరిజన తెగల అల్టిమేటం

లిబియాలో తిరుగుబాటుదారులకూ, ప్రభుత్వ సైనికులకూ జరుగుతున్న తీవ్రమైన పోరు కొత్త మలుపు తిరిగింది. “మిస్రాటా పట్టణం నుండి తిరుగుబాటుదారుల్ని ప్రభుత్వ సైన్యం వెళ్ళగొట్టలేకపోతే చెప్పండి. మేమే అందుకు పూనుకుంటాం” అని స్ధానిక గిరిజన తెగలు అల్టిమేటం ఇచ్చాయని ఉప విదేశాంగ మంత్రి ఖలేద్ కైమ్ ను ఉటంకిస్తూ బిబిసి తెలిపింది. “ఇకనుండి మిస్రాటాలో పరిస్ధితిని అక్కడ నివాసం ఉంటున్నవారు, చుట్టుపక్కల గిరిజన తెగల ప్రజలు ఎదుర్కొంటారు. ప్రభుత్వ సైన్యం ఆ భాధ్యతనుండి విరమించుకుంటుంది. వారు తిరుగుబాటుదారులతో చర్చలు…