పాకిస్తాన్ ప్రభుత్వం, ఐ.ఎస్.ఐ ల ఆదేశంతోనే ముంబై దాడులు -అమెరికా కోర్టులో హేడ్లీ, రాణాలు – 2

తన “మెమొరాండం ఒపీనియన్ అండ్ ఆర్డర్” లో కోర్టు రాణా డిఫెన్స్ వాదనను ప్రస్తావించింది. “పబ్లిక్ అధారిటీ డిఫెన్స్” కింద తనను తాను డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా రాణా హేడ్లీ సాక్ష్యాన్ని మద్దతుగా ప్రస్తావిస్తున్నాడని కోర్టు పేర్కొంది. అంటే పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధికి ఉండే మినహాయింపులను రాణా కోరుతున్నాడు. హేడ్లీ తన సాక్ష్యంలో ఏమేమీ ప్రస్తావించిందీ రాణాకు చెప్పినట్లు తెలపడంతో రాణాకు హేడ్లీ సాక్ష్యాన్ని డివెన్సు గా వినియోగించాడు. కోర్టు ప్రొసీడింగ్స్ వలన పాకిస్తాన్ కి…

పాకిస్తాన్ ప్రభుత్వం, ఐ.ఎస్.ఐ ల ఆదేశంతోనే ముంబై దాడులు -అమెరికా కోర్టులో హేడ్లీ, రాణాలు – 1

ముంబై లోని తాజ్ హోటల్ పై టెర్రరిస్టు దాడులు పాకిస్తాన్ ప్రభుత్వం, దాని గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ ల ఆదేశమ్ మేరకే చేశామని అమెరికా కోర్టులో నిందితులు హేడ్లీ, రాణాలు సాక్ష్యం ఇచ్చినట్లు బయటపడడంతో సంచలనానికి తెర లేచింది. ముంబై టెర్రరిస్టు దాడుల్లో తాజ్ హోటల్ లో బస చేసిన దేశ, విదేశీ అతిధులు 200 మంది వరకూ మరణించిన సంగతి విదితమే. ముంబై దాడుల్లో పట్టుబడ్డ పాకిస్తాన్ యువకుడు కసబ్ కి కోర్టు మరనశిక్ష విధించింది.…

ఇండియాలో 2 జి అవినీతి విచారణపై నార్వే ప్రధాని కలవరం

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒత్తిడితో “2 జి కుంభకోణం” పై సి.బి.ఐ జరుపుతున్న విచారణ పట్ల నార్వే ప్రధాని స్టోల్సెన్ బర్గ్ కలవరపడుతున్నాడు. నార్వే ప్రభుత్వానికి చెందిన టెలినార్ టెలికం కంపెనీపై కూడా సి.బి.ఐ విచారణ జరుపుతుండడమే దీనికి కారణం. కేంద్ర టెలికం శాఖ మంత్రిగా పనిచేసిన ఎ రాజా అరెస్టు అయినప్పటికీ నార్వే ప్రధాని కలవరపడలేదు. రాజా తర్వాత కపిల్ సిబాల్ టెలికం మంత్రిగా రావడంతో టెలినార్ తో పాటు ఇతర ప్రవేటు టెలికం…

బ్రిక్స్ గా మారిన బ్రిక్ కూటమి, జి-7 తో పోటీకి ఉరకలు?

నాలుగు దేశాలు బ్రిక్ కూటమి ఐదు దేశాల బ్రిక్స్ కూటమిగా మార్పు చెందింది. సౌతాఫ్రికా నూతనంగా ఈ కూటమిలో చేరడంతో BRIC కూటమి కాస్తా BRICS కూటమిగా మారింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా లు కలిసి బ్రిక్ కూటమి ఏర్పడింది. ఇప్పటివరకూ ఇది రెండు సమావేశాలను జరుపుకుంది. మూడో సమావేశం సౌతాఫ్రికా తో కలిసి చైనా లోని సాన్యాలో జరుగుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు, ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీలుగా పేరు పొందిన దేశాలు కలిసి ఏర్పాటయిన…

లిబియాపై దాడులు మరింత తీవ్రం చేయాలి -ఫ్రాన్సు, ఇంగ్లండ్

లిబియాపై నాటో ప్రస్తుతం చేస్తున్న దాడులు సరిపోలేదనీ, దాడుల తీవ్రత పెంచాలనీ ఫ్రాన్సు, బ్రిటన్ ప్రభుత్వాలు డిమాండ్ చేశాయి. ఫ్రాన్సు, ఇంగ్లండ్ లు కూడా నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) లో సభ్యులే. లిబియాపై నో-ఫ్లై జోన్ అమలు చేయడానికి నాయకత్వం వహించడానికి అమెరికా తిరస్కరించడంతో నాటో నాయకత్వ పాత్ర నిర్వహిస్తోంది. గడ్డాఫీ విమానదాడులనుండి లిబియా పౌరులను రక్షించడానికి నో-వ్లై జోన్ అమలు చేయాలనీ, లిబియా పౌరులను రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలనూ తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి…

ఇద్దరు పుత్రులతో సహా ముబారక్ ను అరెస్టు చేసిన ఈజిప్టు మిలట్రీ ప్రభుత్వం

ఈజిప్టు ప్రజల ఉద్యమం దెబ్బకు గద్దె దిగిన ఈజిప్టు నియంత ముబారక్, అతని ఇద్దరు పుత్రులను ఈజిప్టు తాత్కాలిక సైనిక ప్రభుత్వం బుధవారం నిర్బంధంలోకి తీసుకుంది. ముబారక్ తో పాటు, అతని కుటుంబ సభ్యులు తమ పాలనలో తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారనీ, వారితో కుమ్మక్కైన సైనిక ప్రభుత్వం విచారణ జరగకుండా కాలం గడుపుతోందనీ ఆరోపిస్తూ ఈజిప్టు ప్రజలు మళ్ళీ తాహ్రిరి కూడలి వద్ద బైఠాయింపు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మళ్ళీ ప్రజా ఉద్యమం ప్రారంభమైనాక సైనికుల కాల్పుల్లో…