జపాన్లో మరో పెద్ద భూకంపం, సునామీ హెచ్చరిక జారీ
జపాన్లో మార్చి11 న వచ్చిన తీవ్ర స్ధాయిలో సంభవించిన భూకంపం, దాని వలన వచ్చిన భయానక సునామీ లు కొట్తిన దెబ్బ నుండి జపాన్ ఇంకా తేరుకోలేదు. ఇంత లోనే ప్రకృతి పగ బట్టిందా అన్నట్లు మరో తీవ్ర భూకంపం జపాన్ ను వణికిస్తోంది. మార్చి 11 న భూకంపం సంభవించిన ఈశాన్య జపాన్ ప్రాంతానికి దగ్గరగా సముద్రంలో 7.4 తీవ్రతతో తాజా భూకంపం సంభవించినట్లు రాయిటర్స్ సంస్ధ తెలిపింది. జపాన్ ప్రభుత్వం తాజా భూకంపం దరిమిలా…
ఐవరీకోస్టులో కొనసాగుతున్న శాంతిదళాల అక్రమ ఆక్రమణ
అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న ఐవరీకోస్టు దేశంలో ఐక్యరాజ్యసమితి, ఫ్రాన్సులకు చెందిన శాంతి దళాల అక్రమ దాడులు కొనసాగుతున్నాయి. ఐవరికోస్టు ప్రజల రక్షణ పేరుతో అడుగుపెట్టిన సమితి శాంతి దళాలు, ఫ్రాన్సు తన ప్రయోజనాల కోసం తలపెట్టిన మిలట్రీ చర్యకు మద్దతుగా అధ్యక్షుడి నివాస భవనాన్ని చుట్టుముట్టాయి. సోమవారం సమితి, ఫ్రాన్సుల సైన్యాల మద్దతుతో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచానంటున్న ‘అలస్సానె ఒట్టోరా’ బలగాలు “అంతిమ దాడి” పేరుతో చేసిన దాడిని అధ్యక్షుడు జిబాగ్బో సైన్యాలు తిప్పికొట్టాయి. ప్రస్తుతం సమితి, ఫ్రాన్సుల…
యూరోజోన్ వడ్డీ రేట్లు పెంచిన యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు
ప్రపంచ ద్రవ్య, ఆర్ధిక సంక్షోభాల తర్వాత యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఇ.సి.బి) మొట్టమొదటి సారిగా వడ్డీ రేట్లను పెంచింది. సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్ల పెంపు, యూరోజోన్ దేశాల ఆర్ధికవృద్ధి, సంక్షోభ పరిస్ధుతులను అధిగమిస్తున్న విషయాన్ని సూచిస్తోంది. 2008 నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం నుండి గట్టేక్కడానికి ప్రపంచ దేశాలు తమ సెంట్రల్ బ్యాంకుల వడ్డీరేట్లను అతి తక్కువ స్ధాయిలో ఉంచి తద్వారా మార్కెట్ కు డబ్బు అందుబాటులో ఉంచాయి. మార్కెట్ కు డబ్బు అధికంగా అందుబాటులో…
లిబియా తిరుగుబాటు బలగాల ఉసురు తీస్తున్న పశ్చిమదేశాల దాడులు
లిబియాపై పశ్చిమ దేశాల దాడులు వాటిని సహాయం కోసం పిలిచిన వారినే చంపుతున్నాయి. బుధవారం అజ్దాబియా పట్టణం నుండి వెనక్కి వెళ్తున్న తిరుగుబాటు బలగాలపై పశ్చిమ దేశాలు నాలుగు క్షిపణులను పేల్చడంతో కనీసం 13 మంది చనిపోగా మరింతమంది గాయపడ్డారని బిబిసి తెలిపింది. లిబియా అధ్యక్షుడు కల్నల్ గడ్డాఫీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తూర్పు లిబియాలో తిరుగుబాటు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. వారిపై వైమానికి బాంబుదాడులు చేస్తూ పౌరులను కూడా గడ్డాఫీ చంపుతున్నాడనీ పశ్చిమ దేశాలు నిందించాయి.…