టి.ఆర్.ఎస్ ఏం సాధించిందని ఉద్యమ దశాబ్ది ఉత్సవాలు జరుపుతోంది?

బుధవారం (ఏప్రిల్ 6) టి.ఆర్.ఎస్ కార్యవర్గం సమావేశమై ఏప్రిల్ 10 నుండి “తెలంగాణ ఉద్యమ దశాబ్ది ఉత్సవాలు” నిర్వహించాలని నిర్ణయించిందని ఆ పార్టీ నాయకుడు కే.సి.ఆర్ ప్రకటించాడు. ఈ సంవత్సరం ఏప్రిల్ 10 నాటికి టి.ఆర్.ఎస్ పార్టీ స్ధాపించి పది సంవత్సరాలు గడిచిందనీ ఆ సందర్భంగా ఉద్యమ దశాబ్ది ఉత్సవాలు జరపాలని నిశ్చయించామని ఆయన సెలవిచ్చారు. పార్టీ పెట్టి పది సంవత్సారాలు అయ్యింది గనక టి.ఆర్.ఎస్ దశాబ్ది ఉత్సావాలు జరపడంలొ అభ్యంతరం లేదు. కానీ “ఉద్యమ దశాబ్ది…

రేడియేషన్ నీటి లీకేజి పూడ్చిన జపాన్ ఇంజనీర్లు

జపాన్ లోని ఫుకుషిమా దైచి అణు కర్మాగారంలో రెండో రియాక్టరుకు ఏర్పడిన పగులును పూడ్చామని టెప్కో (టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ) ఇంజనీర్లు తెలిపారు. “లీకేజిని అరికట్టామని చెబుతున్నా దానిని పరీక్షించాల్సి ఉంది. ఇంకా లీకేజీలేమన్నా ఉన్నాయేమో చూడాల్సి ఉంది” అని జపాజ్ ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ యుకియో ఎడానో పత్రికలతో మాట్లాడుతూ అన్నాడు. సోడియం సిలికేటుతో పాటు మరో రసాయన ఏజెంటును ఉపయోగించి లీకేజిని పూడ్చినట్లు ఇంజనీర్లు తెలిపారు. 15 సెం. మీ మేర ఏర్పడిన…

ఇజ్రాయెల్ గూండా బాంబు దాడుల్లొ ఇద్దరు సూడాన్ కారు ప్రయాణికుల దుర్మరణం

మధ్యప్రాచ్యం ప్రాంతంలో ఇజ్రాయెల్ రౌడీ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రపంచ పోలీసు అమెరికాకి అనుంగు మిత్రుడైన ఇజ్రాయెల్ తాజాగా సూడాన్ లో కారులో ప్రయాణిస్తున్న ఇరువురిని పొట్టన బెట్టుకుంది. చనిపోయినవారు ఎవరైందీ ఇంకా గుర్తించలేదు. పాలస్తీనా ప్రాంతం ‘గాజా’ లోని ప్రభుత్వానికి ఇతర దేశాలు గానీ వ్యక్తులు గానీ ఆయుధాలు సరఫరా చేయకుండా ఉండడానికి ఇజ్రాయెల్ కాపలా కాస్తుంటుంది. పశ్చిమాన మధ్యధరా సముద్రంలో, దక్షిణాన ఎర్ర సముద్రంలోనూ ఇజ్రాయెల్ వాయు, నౌకా బలగాలు కాపలా కాస్తూ అనుమానం వచ్చిన…