పగుళ్ళిచ్చిన జపాన్ అణు రియాక్టర్, అణు ధార్మికత కట్టడికి చర్యలకై వెతుకులాట
భూకంపం, సునామీలతో దెబ్బతిన్న ఫుకుషిమా దైచి అణు కర్మాగారంలో ఒక రియాక్టర్ పగుళ్ళిచ్చి ఉండడాన్ని శనివారం కనుగొన్నారు. చీలిక 20 సెంటీ మీటర్ల మేర ఉందని కర్మాగారం ఆపరేటర్ టెప్కో (టోక్యో ఎలెక్ట్రిక్ పవర్ కంపెనీ) తెలిపింది. ఇప్పటికి కనుగొన్నది ఒక్క పగులేననీ ఇంకా ఉండే అవకాశాలను తోసిపుచ్చలేమని తెలిపింది. గత వారం రోజులుగా కర్మాగారం వద్ద సముద్రపు నీరు బాగా కలుషితమై, చుట్టుపక్కల వాతావరణంలో కూడా అణు ధార్మికత అధిక స్ధాయిలో ఉండడంతో దానికి కారణం…